ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్లో గురువారం గ్రీవెన్స్ మాడ్యూల్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. మాడ్యూల్కు వచ్చిన ఫిర్యాదులు గ్రామాల పరిధిలో ఎంపీడీవోలు, పట్టణాల్లో మునిసిపల్ కమిషనర్ల ద్వారా సంబంధిత అధికారులకు వెళ్తాయని తెలిపారు. ఇళ్ల ఎంపికలో సమస్యలుంటే వెబ్సైట్ indirammaindlu.telangana.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.