యూపీలోని హర్దోయ్లో ఓ వధువు వరుడికి ఫస్ట్ నైట్ రోజే షాకిచ్చింది. రామ్ ప్రతాప్ యాదవ్కు మహారాజ్గంజ్లోని ఒక గ్రామానికి చెందిన యువతితో 2 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వధువు తల్లిదండ్రుల ఇంటివద్దనే ఉండగా.. ఈ నెల 10న రామ్ భార్యను తన ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో ఫస్ట్ నైట్ కు ఏర్పాట్లు చేశారు. అన్నం తిని గదిలోకి వెళ్లిన రామ్ మైకంలోకి వెళ్లడంతో వధువు రూ.13,000తో పాటు కొంత బంగారం తీసుకెళ్లింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.