తెలంగాణకు 11 ఏళ్లలో ఏం చేశారు? అని బీజేపీ నేతలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. 'రాష్ట్రానికి ఒక్క రూపాయి తీసుకురాకుండా 8 మంది BJP MPలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం చేశారు? 60 ఏండ్లు దాటిన సన్న, చిన్నకారు రైతులకు నెలకు పించన్లు ఇస్తామని 2019 MP ఎన్నికల ప్రణాళికలో ఒట్టేశారు.. అమలు చేశారా? ఎంత మంది రైతన్నలకు పించన్లు ఇచ్చారు? రూ.6 వేల కిసాన్ సమ్మాన్ నిధి పెంచుతామన్నారు..పెంచారా?' అని ప్రశ్నించారు.