ఐపీఎల్-2025లో భాగంగా బుధవారం రాజస్థాన్తో జరిగిన మ్యాచులో సూపర్ ఓవర్ ద్వారా ఢిల్లీ విజేతగా నిలిచింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం మ్యాచ్ టై అయితే తర్వాత 10 నిమిషాల్లో సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. సూపర్ ఓవర్లో కూడా ఫలితం తేలకపోతే తర్వాత 5 నిమిషాల్లో రెండో సూపర్ ఓవర్ నిర్వహించబడుతుంది. ఇది కూడా టై అయితే మ్యాచ్ అయిపోయిన ఒక గంట వరకు సూపర్ ఓవర్లు నిర్వహించవచ్చు. ఒకవేళ సూపర్ ఓవర్ ఆడటం సాధ్యం కాకపోతే మ్యాచ్ టై అవుతుంది.