జమ్మూ కళ్మీర్‌లో ఏం జరుగుతోంది: సీఎం ఒమర్ అబ్దుల్లా

66చూసినవారు
కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాక్‌ తన వక్రబుద్ధిని చాటుకుంది. శ్రీనగర్‌లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ సంగతేంటని ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. శనివారం రాత్రి శ్రీనగర్‌లో నాలుగు ప్రాంతాల్లో కాల్పుల శబ్దాలు వినిపించాయి. అఖ్నూర్, రాజౌరీ, పూంచ్ సెక్టార్‌లో పాక్ డ్రోన్లను పంపగా, భారత సైన్యం తిప్పికొడుతోంది.

సంబంధిత పోస్ట్