ప్రపంచ లింగ అసమానత నివేదిక-2025లో భారత్ గతంతో పోలిస్తే రెండు స్థానాలు కిందకు దిగజారి 131వ స్థానంలో నిలిచింది. 64.1 శాతం స్కోర్తో దక్షిణాసియాలో అతి తక్కువ ర్యాంక్ పొందిన దేశంగా నిలిచింది. భారత్ కంటే ముందు బంగ్లాదేశ్, శ్రీలంక, నెపాల్ ఉన్నాయి. మహిళల అక్షరాస్యత రేటు పెరిగింది. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలో మహిళల ప్రవేశం మెరుగైంది.