TG: తన స్కూల్లో 7వ తరగతి చదువుతున్న బాలికతో 9వ తరగతి బాలుడు చేసిన వాట్సాప్ చాట్ అతని ప్రాణం తీసింది. బాలిక కుటుంబసభ్యులు ఇది గమనించి మనోజ్(15)ను బెదిరించడంతో అతడు భయపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంచుపల్లి మండలంలోని చుంచుపల్లిలో చోటుచేసుకుంది. మనోజ్ రోజు బాలికతో వాట్సాప్లో చాటింగ్ చేయడంతో ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భయపడిన మనోజ్ ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగాడు.