తెలంగాణలో జూన్ 12న ప్రభుత్వం స్కూళ్లను రీఓపెన్ చేయనుంది. ఆ రోజునే పిల్లలకు పుస్తకాలు, యూనిఫాం అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా జూన్ 6 నుంచి 19 వరకు ‘బడిబాట’ నిర్వహించాలని తాజాగా ఆదేశించింది. ఇందులో మహిళా సంఘాలు, స్కూలు కమిటీలు, టీచర్లు, HMలు, పీరెంట్స్ భాగస్వామ్యం చేయాలని కోరింది.