భారత్, పాక్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఐపీఎల్-2025 నిరవధిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం IPL మార్చి 22 నుంచి ఈ నెల 25 వరకు జరగాల్సి ఉంది. లీగ్ మ్యాచ్లు దాదాపు ముగిశాయి. ప్లే ఆఫ్కు చేరుతున్న క్రమంలో భద్రతా కారణాల రీత్యా టోర్నీ వాయిదా పడింది. అయితే, ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్లో జరగాల్సిన ఆసియా కప్ స్థానంలో మిగతా ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తారని క్రీడా వర్గాలు తెలిపాయి.