తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన గెలుపు మనదేనని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు తాను తిరుగుతున్నానని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు తనను రమ్మని కోరుతున్నారని, మళ్లీ పాలకుర్తి నుంచి పోటీ చేసి ప్రత్యర్థుల సంగతి చూస్తానని హెచ్చరించారు.