హైదరాబాద్లోని అమీర్పేట్, మియాపూర్, నాగోల్, ఎల్బీ నగర్, హైటెక్ సిటీ లాంటి రద్దీ స్టేషన్లలో చిల్లర సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఉదయం 7:30–9:30, సాయంత్రం 5:30–8:30 రష్ అవర్స్లో టికెట్ కౌంటర్ల వద్ద పెద్ద క్యూలు ఏర్పడుతున్నాయి. చిల్లర లేక టికెట్ తీసుకోవడానికి ఎక్కువ సమయం పడుతోంది. దీంతో కొందరు రైళ్లను మిస్ అవుతున్నారు. పెయిడ్ టాయిలెట్ల వద్ద కూడా చిల్లర సమస్య ఉంది. అటెండెంట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.