27 ఏళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి స్పందించారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాషాయజెండా రెపరెపలాడుతోందని పురంధేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం విశాఖపట్నంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చామని అన్నారు. కార్యకర్తల కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు.