ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో 'లేసినే' విభాగంలో భారతీయ డాక్యుమెంటరీగా ‘సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్స్ టు నో’ మొదటి బహుమతి గెలుచుకుంది. దీనికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు గంట నిడివిలోపు ఉన్న షార్ట్ఫిల్మ్ను ఎంట్రీగా పంపొచ్చు. ఈసారి మొత్తం 555 ఫిల్మ్ స్కూల్స్ నుంచి 2,263 ఎంట్రీలు రాగా మొదటి బహుమతి పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కు చెందిన చిదానంద నాయక్ తీసిన ఈ డాక్యుమెంటరీకి లభించింది.