టెరిటోరియల్ ఆర్మీలో ఎవరుంటారో తెలుసా?

78చూసినవారు
టెరిటోరియల్ ఆర్మీలో ఎవరుంటారో తెలుసా?
టెరిటోరియల్ ఆర్మీ భారత సైన్యానికి సహాయక సేవలు అందించే పార్ట్-టైమ్ వాలంటీర్ల రిజర్వ్ ఫోర్స్. సాధారణ సమయాల్లో తమ పనులు చేసుకుంటూ, సైన్యానికి అవసరమైనప్పుడు సేవలు అందిస్తారు. ఆర్మీతో కలిసి విపత్తుల సహాయక చర్యలు, శత్రువులపై పోరాటాలకై శిక్షణ తీసుకొని సిద్ధంగా ఉంటారు. వీరికి సైనికులతో సమాన ర్యాంకులుంటాయి. దేశంలో 50 వేల మంది వరకు గల ఈ సైన్యంలో సచిన్, ధోనీ, కపిల్ దేవ్, అనురాగ్ ఠాకూర్, మోహన్ లాల్ వంటి ప్రముఖులున్నారు.

సంబంధిత పోస్ట్