AP: వైసీపీ నాయకురాలు, యాంకర్ శ్యామల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆధ్యాత్మిక స్థలాలను కూల్చివేస్తోందని ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలో సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ ఎక్కడ? అని ఆమె ప్రశ్నించారు. ఆయన సొంత శాఖ అధికారులు ఆధ్యాత్మిక స్థలాలను కూలుస్తున్నా పవన్ కళ్యాణ్ స్పందించట్లేదని.. ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె నిలదీశారు.