బీసీ కులగణన రిపోర్ట్ ను రేవంత్ సర్కారు అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదని MIM MLA అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన రిపోర్టు అసెంబ్లీలో పెట్టలేదని చెప్పి గత BRS ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈరోజు చేస్తుంది ఏంటని మండిపడ్డారు. రిపోర్టు అసెంబ్లీలో పెట్టాలని సూచించారు. రిపోర్టును స్టడీ చేసిన తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టాలని ఓవైసీ శాసన సభలో వెల్లడించారు.