యూపీలోని ఆగ్రా జిల్లాలో ఓ మహిళ ప్రియుడి కోసం తాళికట్టిన భర్తను కడతేర్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. జితేంద్ర అనే వ్యక్తి తన భార్యతో కలిసి బోండ్లా ప్రాంతంలో నివసిస్తున్నాడు. సదరు మహిళ అంబులెన్స్ డ్రైవర్తో విహహేతర సంబంధం ఏర్పడింది. వీరి ఏకాంతానికి భర్త అడ్డుగా ఉన్నాడని కత్తితో గొంతు కోసి చంపింది. అనంతరం ఓ ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లి 65 కి.మీ దూరం పడేసింది. ఏం తెలియనట్టు పీఎస్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టగా.. అసలు విషయం బయటపడింది.