భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ బెదిరింపులకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఉన్న అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపు మెయిల్ను పంపింది. స్టేడియాన్ని పేల్చేస్తామని.. ఇప్పటికే భారత్లోని స్లీపర్ సెల్స్ను యాక్టివ్ చేశామని మెయిల్లో పేర్కొంది. కాగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఇలాంటి మెయిల్స్ను పంపింది. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశాయి.