TG:మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యుద్ధం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి స్థాయి యుద్ధమే వస్తే.. అవసరం అయితే సరిహద్దుకు వెళ్లి యుద్ధంలో పాల్గొంటానని సంచలన ప్రకటన చేశారు. పాక్ను కట్టడిచేయడంతో భారత్ ఆర్మీని ప్రశంసించారు. ఇలాంటి సమయంలో భారత్ ఆర్మీకి మనమందరం మద్దతుగా ఉండాలని సూచించారు. మన ఆర్మీని చూసి దేశం గర్విస్తోందని పేర్కొన్నారు. తాను కూడా మిలిటరీలో పని చేశానని, తనకు యుద్ధం పై అవగాహన ఉందని వెల్లడించారు.