కొత్త గవర్నర్ గా వచ్చిన జిష్ణుదేవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టాక తొలి నిర్ణయం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపైనే ఉంటుందా? అనే చర్చ మొదలైంది. గురువారం కేబినెట్ సమావేశంలో కోదండరాం, ఆమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో కోదండరాం పాత్ర విస్మరించలేనిది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ కానుండడంతో మంత్రి పదవి కూడా లభించే చాన్సుందని భావిస్తున్నారు.