TG: ఎన్నికల ముందు ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చి అవి నెరవేర్చకుండా.. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట మారుస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. హైదరాబాద్ లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వాగ్ధానాలు చేసేటప్పడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రేవంత్రెడ్డికి తెలీదా? అని ప్రశ్నించారు. హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.