HYD-సెక్రటరియేట్లో నిర్వహించిన కలెక్టర్లతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 26 నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 4 పథకాల అమలుపై అన్ని గ్రామాల్లో గ్రామసభలను నిర్వహిస్తామన్నారు. ఈనెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానని సీఎం వెల్లడించారు.