చైనాలో 'యాగి' కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ తుపాన్ అక్కడ బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో గంటకు 234 కి.మీ వేగాన్ని మించి బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో, వాహనాలతో సహా మనుషులు కొట్టుకుపోయాయి. పలుచోట్ల రేకుల షెడ్స్ గాల్లోకి ఎగిరిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తుపానుపై చైనా జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలెర్ట్ జారీ చేసింది.