ఉత్తరప్రదేశ్లోని హావూర్ జిల్లా చెజార్సీ టోల్ ప్లాజా వద్ద ఓ మహిళ టోల్ ప్లాజా ఉద్యోగిపై దాడికి పాల్పడింది. ఉద్యోగి అని కూడా చూడకుండా చితకొట్టేసింది. ఇలా కొట్టడానికి గల కారణం ఫాస్టాగ్ ఖాతాలో బ్యాలెన్స్ లేకపోవడంతో, టోల్ చెల్లించాలని ఉద్యోగి అడగడం. దీంతో ఆమెకు కోపం వచ్చి దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై టోల్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేయగా, సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు.