AP: నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది ఓ మహిళపై కొడవలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. 20ఏళ్ల క్రితం భర్త వదిలేయడంతో తోటపల్లిగూడూరుకు చెందిన శేషమ్మ మండలానికి చెందిన కరుణాకరణ్ సహజీవనం చేస్తుంది. విషయం తెలుసుకున్న కరుణాకరణ్ బావమరిది శ్రీనివాసులు కోపంతో శేషమ్మపై కొడవలితో దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలపాలైన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.