సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేస్తే ప్రపంచ బ్యాంక్ రంగంలోకి దిగి పాకిస్తాన్ను ఆదుకుంటాయని అంచనాలు వచ్చాయి. ఈ క్రమంలో పాకిస్తాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా, సింధూ జలాల ఒప్పందంపై వరల్డ్ బ్యాంక్ స్పందించింది. ఒప్పందం నుంచి భారత్ వైదొలగడంపై ఇందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ప్రపంచ బ్యాంకు సహాయక పాత్ర మాత్రమే పోషిస్తుందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా స్పష్టం చేశారు.