పారిస్ ఒలింపిక్స్లో భారత రెజ్లర్ అమన్ సహ్రావత్ క్వార్టర్స్ ఫైనల్స్లోకి ప్రవేశించాడు. పురుషుల 57 కేజీల ప్రిక్వార్టర్స్లో అమన్ 10-0 తేడాతో వాద్లిమిర్ని మట్టికరిపించాడు. అమన్ ప్రత్యర్థిపై తొలి రౌండ్ ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించాడు. మొదటి రౌండ్లో వాద్లిమిర్ను రెండుసార్లు కిందపడగొట్టి నాలుగు పాయింట్లు సాధించాడు. తర్వాత కూడా జోరు కొనసాగించి మరో రెండు పాయింట్లు రాబట్టాడు.