డబ్ల్యూటీసీ 2025 ఛాంపియన్స్గా సౌతాఫ్రికా నిలిచింది. మార్క్రమ్ అజేయ సెంచరీ(136)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.దీంతో మార్క్రమ్ అరుదైన రికార్డును అందుకున్నాడు. 29 ఏళ్ల తర్వాత ఐసీసీ ఫైనల్స్లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 1996 సంవత్సరంలో శ్రీలంక క్రికెటర్ అరవింద డిసిల్వా ఒక్కడే ఆసీస్పై శతకం నమోదు చేశాడు. ఐసీసీ ఫైనల్స్లో సెంచరీ చేసిన తొలి దక్షిణాఫ్రికా ప్లేయర్గా మార్క్రమ్ ఘనత సాధించాడు.