ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మూడో రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 282 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 213/2 స్కోర్ చేసింది. ఐదెన్ మార్క్రమ్ (102*) తన దైన శైలిలో సెంచరీ సాధించాడు. తెంబా బావుమా (65*) హాఫ్ సెంచరీతో క్రీజ్లో ఉన్నారు. దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 69 పరుగులు అవసరం కాగా.. ఇంకా రెండు రోజుల సమయం మిగిలి ఉంది.