ఉపరితల ఆవర్తనం వల్ల తెలంగాణలో నేటి నుంచి రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో నల్గొండ, సూర్యాపేట, ఉమ్మడి వరంగల్, భువనగిరి, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. మరోవైపు ఏపీలో ఎండతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.