ఆత్మకూర్ ఏం: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

76చూసినవారు
నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్షపూరితంగా ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చార్జిషీట్లో చేర్చడానికి నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఏం మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య, డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్