శంషాబాద్లో 21, 22 తేదీలలో జరిగే తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు బోలగాని సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ పిలుపునిచ్చారు. గురువారం భువనగిరిలో గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.