బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి తారుణ్ రెడ్డి ఆధ్వర్యంలో బీబీనగర్లో నిర్వహించిన ఉద్యోగ మేళా విజయవంతంగా పూర్తైంది. ఈ మేళాలో సుమారు 1200 పైగా యువత తమ అవకాశాలను వినియోగించుకున్నారు. 63 పైగా ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి. ఉద్యోగ మేళాలో 250 పైగా యువతను వెంటనే నియమించి స్పాట్ హైరింగ్ చేశారు. అలాగే 200 పైగా అభ్యర్థులు తదుపరి రౌండ్లకు ఎంపికయ్యారు.