యాదగిరిగుట్ట శ్రీ శ్రీ సుదర్శన లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్య స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శనివారం ఆహ్వానించారు. ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ తో పాటు యాదగిరిగుట్ట ఆలయ ఈవో, అర్చకులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు ఆహ్వానాన్ని అందజేశారు.