యాదగిరిగుట్ట మండలంలోని పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ పరిశ్రమలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. భారీ శబ్దంతో పేలడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్తో కార్మికులను అప్రమత్తం చేసింది.