శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తేనే జీవితంలో విజయం సాధించగలరని ప్రముఖ సైకాలజిస్ట్ రాజేశ్వరి జస్తి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశముఖి గ్రామం విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం స్టూడెంట్ అఫైర్స్ ఆధ్వర్యంలో "విద్యార్థుల మానసిక ఆరోగ్యం" అనే అంశంపై రెండు రోజుల వర్క్షాప్ నిర్వహించారు. ఆలోచనా విధానాలు, ప్రవర్తన - విజయం అనే విషయంపై రాజేశ్వరి జస్తి మాట్లాడారు.