సహజకవి పోచంపల్లి పోతన కైరం కొండ నరసింహ అనారోగ్యంతో మృతి

335చూసినవారు
సహజకవి పోచంపల్లి పోతన కైరం కొండ నరసింహ అనారోగ్యంతో మృతి
భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కేంద్రానికి చెందిన సహజకవి పోచంపల్లి పోతన కైరం కొండ కొండ నరసింహ శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. నిరక్షరాస్యుడైన తన సహజ కవిత్వంతో ఎన్నో యక్షగానాలు, భక్తి కీర్తనలు రచించిన ఆయన పద్మశాలి శతకం, భార్గవి శతకం, శ్రీ రామ శతకం రచించారు. ఆయన మృతి పట్ల సాహితీవేత్తలు, కవులు సంతాపం తెలిపారు. ఇతనికి భార్య ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు.

ట్యాగ్స్ :