యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం వడ్డించిన అన్నం పూర్తిగా మెత్తగా ముద్దలై, గడ్డలు కట్టి పలుకైంది. దీంతో ఆ భోజనాన్ని విద్యార్థులు తినలేక పడేశారు. ఖాళీ కడుపులతోనే తరగతి గదుల్లోకి వెళ్లారు. కొంత మంది విద్యార్థులు మాత్రం ఆకలికి తట్టుకోలేక బయట హోటల్లో టిఫిన్ చేశారు.