ఏపీ మంత్రి నారా లోకేష్ రెడ్బుక్పై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సంచలన ట్వీట్ చేశారు. విశాఖ రావాల్సిన మైక్రోసాఫ్ట్ సంస్థ.. నోయిడా వెళ్లడానికి లోకేష్ రెడ్బుక్ కారణం అంటూ తాటిపర్తి ఆరోపించారు. ప్రజాగళం మేనిఫెస్టో ఎప్పుడు అమలు చేస్తారు అని లోకేష్ను ఆయన నిలదీశారు. కక్ష ఉంటే మాపై తీర్చుకోండి.. తల్లిలాంటి రాష్ట్రంపై దాష్టీకం ఎందుకు? అంటూ తాటిపర్తి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.