ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, అధ్యాత్మిక సాధనమైన యోగా.. పాకిస్థాన్లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. ఇస్లామాబాద్ రాజధాని అభివృద్ధి సంస్థ (CDA) ఇక్కడి ఎఫ్-9 పార్క్లో ఉచిత యోగా తరగతులు ప్రారంభించింది. ఇప్పటికే చాలా మంది ఇందులో చేరినట్లు ఆ సంస్థ ఫేస్బుక్లో ప్రకటించింది. సీడీఏ నిర్ణయాన్ని స్థానికులు స్వాగతిస్తున్నారు.