కేంద్రం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరితే ప్రతి నెల రూ.5 వేలు పొందొచ్చు. తక్కువ ఆదాయం కలిగిన వారికి ఈ పథకంలో చేరటం ఉత్తమం. ఇక 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసులోపు వారు ఈ పథకానికి అర్హులు. ఇక నెలకు రూ.210 చొప్పున 60 ఏళ్లు వచ్చే వరకూ చెల్లిస్తే.. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా రూ.5,000 వస్తాయి. ఒకవేళ చందదారుడు మరణిస్తే ఆ డబ్బును చందదారుడి జీవిత భాగస్వామికి అందజేస్తారు.