తిరుమల శ్రీవారిని హీరో శ్రీకాంత్ కుమారుడు, యువనటుడు రోషన్ దర్శించుకున్నారు. శనివారం వీఐపీ విరామ దర్శన సమయంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో రోషన్కు అర్చకులు వేదాశీర్వచనలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.