కర్ణాటకలోని యశవంతపుర విషాద ఘటన జరిగింది. దర్శన్ (22) అనే వ్యక్తి ఓ యువతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొందామని దర్శన్ యువతిని అడిగాడు. కానీ ఆమె ఇందుకు నిరాకరించింది. దీంతో విరక్తి చెందిన దర్శన్ ఈ నెల 5న ఇంటిలో పురుగుల మందు తాగాడు. అస్వస్థతకు గురవ్వడంతో మైసూరు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. అరసికెరె గ్రామీణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.