TG: సముద్రంలో కొట్టుకుపోయి ఓ యువకుడు మృతి చెందాడు. మెదక్ జిల్లా రామాయంపేట ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న టంకరి రాము (34) ముంబై సముద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి బోటు ప్రయాణం చేసి ఒడ్డుకు చేరుకున్నాడు. బోటు దిగిన వెంటనే నీటి అలలు వేగంగా రావడంతో సముద్రంలోకి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. కొద్ది నిమిషాల ముందే కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన రాము మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.