ఉత్తరప్రదేశ్లోని లక్నోలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఆష్బాగ్ అవుట్పోస్ట్ ముందు ఉన్న భారీ గుంతలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు తన బైక్తో సహా పడిపోయాడు. దీంతో బాటసారులు అతడిని క్షేమంగా కాపాడారు. అనంతరం బైకును ఒడ్డుకి చేర్చారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.