ఛత్తీస్గఢ్లోని బలోదబజార్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. అక్కడి ఇసుక మాఫియా దోపిడీ ఎక్కువ ఆయిపోయింది. దీంతో మాఫియా రౌడీలు ఇన్ఫార్మర్ అనే ఓ యువకుడిని అనుమానంతో కూడలి మధ్యలో ఒక స్తంభానికి కట్టేసి బెల్టు, కర్రలతో దారుణంగా కొట్టారు. సదరు యువకుడు కొట్టవద్దని ఎంత వేడుకున్నా వదల్లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు నిందితులను కఠినంగా శిక్షించాలని అంటున్నారు.