తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న తెలంగాణ సారస్వత పరిషత్లో యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ను గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో ఆవిష్కరించారు. తెలంగాణ జీవనశైలి విశిష్టతను చాటి చెప్పడంతో పాటు యువతలో సాహితీ స్పృహను, చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ యువ కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు.