ఢిల్లీలోని రాజేంద్ర నగర్ మెట్రో స్టేషన్లో ఓ యువతి శనివారం ఆత్మహత్యాయత్నం చేసింది. కదులుతున్న రైలు ముందు దూకి చనిపోవాలని ప్రయత్నించింది. ట్రాక్పై ఆ యువతి పరుగులు పెట్టడం మెట్రో సిబ్బంది గమనించారు. వెంటనే మెట్రో రైలును డ్రైవర్ సకాలంలో ఆపి వేశారు. ఇక ట్రాక్పై పరుగులు పెట్టిన ఆ యువతిని సిబ్బంది చేతులపై ఎత్తుకుని, స్టేషన్ ఆవరణలోకి చేర్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.