ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీకి చెందిన ఈ వీడియోలో ఓ యవతి శతాబ్ధి ఎక్స్ప్రెస్తో పోటీ పడుతుంది. ఆ రైలు పట్టాలపై వెళ్తుండగా దాని పక్కనే పరిగెడుతుంటుంది. అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, రైల్వేబోర్టు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. రైల్వే ట్రాక్లపై ఇలాంటివి చేస్తే కఠిన చర్యలు ఉండాయని సూచించింది.