యూట్యూబర్ హర్షసాయి బాధితురాలు మరోసారి పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చేస్తున్నారని, ఇలా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ట్రోలింగ్కి సంబంధించిన పలు స్క్రీన్ షాట్లను పోలీసులకు సమర్పించారు. హర్షసాయి ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేయిస్తున్నాడని బాధితురాలు ఆరోపించారు.